ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ భారత దేశంలో వివిధ భాషల్లో వస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో సల్మాన్ హూస్ట్ గా ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకొని పదమూడో సీనన్ రన్ అవుతుంది.  అయితే తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ, మరాఠీ భాషల్లో కూడా బిగ్ బాస్ వస్తుంది.  నిన్న తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 3 ఎంతో గ్రాండ్ గా పూర్తి చేసుకున్నారు.  నాగార్జున హూస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి రాహూల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు.  ఆయన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రోఫీని అందుకున్నారు. 

ఇక తమిళ బిగ్ బాస్ సీజన్ 3 కి కమల్ హాసన్ హూస్ట చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి తమిళ బిగ్ బాస్ షో పై ఎన్నో కాంట్రవర్సీలు వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 తమిళంలో కంటెస్టంట్ గా పాల్గొన్న మీరా మిథున్ షోపై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న నటి మధుమిత.. విజయ్ టీవీ ఛానెల్ పై ఆరోపణలు చేసింది. మధుమిత తనకు పారితోషికం ఇవ్వలేదని రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మీరా మిథున్  బిగ్ బాస్ సీజన్ 3 పాల్గొని, దాని నుండి బయటకి వచ్చి రెండు నెలలు కావోస్తుందని చెప్పింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నందుకు గానీ, ఆ గేమ్ షో నిర్వాహకులు తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించింది.

ఇదేమని ప్రశ్నిస్తే తనపైనే రివర్స్ అవుతున్నారని ఆవేదన చెందుతుంది.  అంతే కాదు ఇటీవల తను అందాల పోటీలు నిర్వహించినప్పుడు పోలీసులు అడ్డుపడి ఫైనల్స్ జరగకుండా ఆపేశారని.. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపణలు చేసింది.  అదేవిధంగా తన గురించి తప్పుడు ప్రచారం చాలానే జరుగుతోందని ఆరోపించింది. మొత్తం మీద తమిళనాడులో నివశించడానికి తనకు రక్షణ లేని పరిస్థితి నెలకొందని వాపోయ్యింది. అందుకే వేరే రాష్ట్రానికి వెళ్లితేనే సురక్షితంగా జీవించగలనంది. ఇక్కడ పోలీసులు లంచం తీసుకుని తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించింది. త్వరలో తాను రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పిన ఈ అమ్మడు ఏ పార్టీ అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: