సంక్రాంతి రేసు సినిమాలలో కళ్యాణ్ రామ్ నిజంగా నిలబదతాడా అన్న సందేహాలకు చెక్ పెడుతూ ‘ఎంత మంచి వాడవురా’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 8న భాగ్యనగరంలోని జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫంక్షన్ కు అతిధిగా రావడానికి జూనియర్ అంగీకరించినప్పటికీ మరొక అతిధిగా బాలయ్యను ఒప్పించడం కళ్యాణ్ రామ్ కు తలకు మించిన భారంగా మారింది అని అంటున్నారు. 

వాస్తవానికి కళ్యాణ్ రామ్ అంటే బాలకృష్ణకు అభిమానం ఉన్నప్పటికీ జూనియర్ తోనే ఇంకా పూర్తిగా బాలకృష్ణ రాజీ పడలేకపోతున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. వాస్తవానికి హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లపై కొంతవరకు సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో తన సినిమా ఫంక్షన్ కు నందమూరి ఫ్యామిలీ హీరోలను ఒకేసారి వేదికపైకి తీసుకు రాగలిగితే ఆ మూవీ వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారి తద్వారా తన సినిమా విషయాలు అందరికీ తెలుస్తాయని కళ్యాణ్ రామ్ అభిప్రాయం. దీనితో తాను పిలిచినా బాలకృష్ణ సున్నితంగా తిరస్కరిస్తాడు అన్న ఆలోచనలతో కళ్యాణ్ రామ్సినిమా నిర్మాణ భాగస్వామి శివలెంక కృష్ణ ప్రసాద్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. 

గతంలో శివలెంక కృష్ణప్రసాద్ బాలకృష్ణతో చాల సినిమాలు తీసిన అనుబంధం ఉంది. దీనితో బాలయ్యకు కృష్ణ ప్రసాద్ అంటే ప్రత్యేకమైన గౌరవం. ఈ విషయాన్ని ఆధారంగా తీసుకుని శివలెంక కృష్ణప్రసాద్ ద్వారా బాలయ్యను తన సినిమా ఫంక్షన్ కు అతిధిగా పిలిచి తన కోరిక నెరవేర్చుకోవాలి అని కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సస్ అవుతాయి అన్నవిషయం ఒక రెండు రోజులలో తేలిపోతుంది. బన్నీ మహేష్ ల సినిమాల పోటీ మధ్య తన సినిమాకు తక్కువ ధియేటర్లు దొరికినా తన సినిమాలు చూసిన ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీతో ఖచ్చితంగా తన మూవీ సక్సస్ అవుతుంది అన్న నమ్మకం కళ్యాణ్ రామ్ కు ఉంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: