మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న నివేదా పేతురాజ్ ప్రస్తుతం సాయి ధరం తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. దేవా కట్టా డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాతో మరోసరి సాయి ధరం తేజ్ తో జోడీ కడుతుంది నివేదా పేతురాజ్. ఇదేకాకుండా అమ్మడు మరో ఫీమేల్ సెంటిక్ మూవీలో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

కార్తికేయ, ప్రేమమ్, సవ్యసాచి సినిమాలతో టాలెంట్ చూపించిన చందు మొండేటి ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. నిఖిల్ తో సూపర్ హిట్ సీక్వల్ తో వస్తున్న చందు మొండేటిసినిమా సెట్స్ మీద ఉండగానే నివేదా పేతురాజ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈరోజే సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ఇది చేస్తున్నారట.

ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. కేవలం సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. సినిమాలో నటించే మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. రామోజి ఫిల్మ్ సిటీలోనే సింగిల్ షెడ్యూల్ తోనే ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా పర్ఫెక్ట్ స్కెచ్ వేశారు చిత్రయూనిట్. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో చిన్న పాత్రలో మెప్పించిన నివేదా పేతురాజ్ రామ్ రెడ్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.                                                          

మరింత సమాచారం తెలుసుకోండి: