ప్రేమ.. పెళ్లి.. పిల్లలు.  ఆతర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్. సినిమా హీరోయిన్స్‌ లైఫ్‌ షెడ్యూల్‌ దాదాపుగా ఇలాగే ఉంటుంది. సమీరా రెడ్డి ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో యమా యాక్టీవ్‌గా ఉండటంతో.. సమీరా కెమెరా ముందుకు వచ్చేస్తోందంటూ ప్రచారం జరగుతోంది. ఈ న్యూస్‌లో నిజముందా? లేదా? ఈ తెలుగమ్మాయి రెస్పాన్స్‌ ఏంటి? అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో కలుగుతున్నాయి.

సమీరారెడ్డి తెలుగులో ముచ్చటగా మూడు సినిమాల్లో కనిపించి కనుమరుగైపోయింది. నరసింహుడులో చిరంజీవితో.. జై చిరంజీవాలో మెగాస్టార్‌తో.. కృష్ణం వందే జగద్గురుమ్‌లో ప్రత్యేక గీతంలో మెరిసింది. ఈ అమ్మడు నటించిన తెలుగు మూవీ ఒక్కటీ హిట్‌ కాకపోవడంతో.. ఆ తర్వాత ఆఫర్స్‌ దక్కలేదు. హిందీ.. తమిళంలో నటించినా.. ఎక్కడా స్టార్‌ ఇమేజ్‌ దక్కలేదు. కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతున్న సమయంలో ప్రేమించిన బిజినెస్‌మేన్‌ అక్షయ్‌ను పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది సమీరా.

సమీరా ఆ మధ్య ప్రెగ్నెన్సీ టైంలో ప్రసవానంతరం శరీరాకృతి సమస్యలు.. మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ మధ్యకాలంలో పిల్లల ఆటాపాటలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించింది. ఈ దూకుడు చూసి.. సమీర నటించడానికి రెడీ అంటూ.. కథనాలు వచ్చేశాయి.

ఆర్య, విశాల్‌ కలిసినటిస్తున్న కోలీవుడ్‌ చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై సమీర స్పందిస్తూ.. ఇవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా సమయంలో రిస్క్‌ ఎందుకని గ్యాప్‌ తీసుకుందా?  ఒకటి రెండు ఏళ్ల తర్వాత కెమెరాకు పని చెబుతుందేమో చూడాలి మరి. అప్పటివరకు  పిల్లలతో ఎంజాయ్‌ చేస్తూ.. పిల్లలతో కలిసిపోయి ఆడిపాడుతుందేమో చూడాలి.

మొత్తానికి సమీరా రెడ్డి సినిమాల్లోకి రీఎంట్రీ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి సినీజనాలు అనుకున్నట్టు ఏ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తుందో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: