టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై రిలీజ్ చేసిన టీజర్లు అదరగొట్టేశాయి. దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అంతర్జాతీయ నటులు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ దశలో ఉంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో హాలీవుడ్ నుంచి కూడా నటీనటులు వస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలో నటిస్తున్న ఐరిష్ భామ అలిసన్ డూడీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనేందుకు ఇండియా వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. ‘లేడీ స్కాట్ ఇండియాకు వస్తోంది’ అంటూ తన వాల్ లో రాసుకుంది. ఆర్ఆర్ఆర్, రాజమౌళి పేర్ల హ్యాష్ ట్యాగ్ ను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనబోతోందని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాల్గొంటున్నారు. త్వరలోనే అలియా భట్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.

సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఈమెతోపాటు రే స్టీవెన్ సన్ కూడా నటిస్తున్నారు. వీరి రాకపై ఇంకా అఫిషియల్ న్యూస్ రాలేదు. కానీ.. అలిసన్ డూడీ వస్తుంటే మరి స్కాట్ కూడా రావాల్సిందే. దీంతో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని అర్ధమవుతోంది. పాన్ ఇండియా కథాంశంతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: