టాలీవుడ్ సినిమా పరిశ్రమకి చలో మూవీ ద్వారా అడుగుపెట్టిన రష్మిక మందన్న ఆ మూవీతో భారీ సక్సెస్ అందుకున్నారు. అంతకుముందు కన్నడలో రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన కిరిక్ పార్టీ అనే మూవీ ద్వారా చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన రష్మిక ఆపై తెలుగులో కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక చలో తర్వాత ఆమె నటించిన సినిమా గీత గోవిందం. విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ ని అందుకుంది.

అలానే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు, వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ యాక్టర్ నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాలతో మరొకరు రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే భారీ పాన్  ఇండియా సినిమా అలానే యువ నటుడు శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తున్నారు. మరోవైపు తమిళ్, హిందీ సినిమా పరిశ్రమల్లో కూడా అవకాశాలతో స్టార్ నటిగా దూసుకెళుతున్న రష్మిక తరచూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు.

అందులో భాగంగా నేడు ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు రష్మిక. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు కనిపించడం లేదు కాస్త మా గురించి కూడా పట్టించుకోండి అంటూ సరదాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్న కు, నేను కొన్నాళ్లుగా సినిమాలతో వరుసగా బిజీగా ఉంటున్నాను మీరు నా అభిమానులుగా గర్వంగా చెప్పుకునేలా మరింత కష్టపడుతూ ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నాను, అందుకే ఎక్కువగా టచ్లో ఉండలేకపోతున్నాను ఇకపై వీలైనంత ఎక్కువగా మీతో అందుబాటులో ఉంటాను అంటూ ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: