టాలీవుడ్ రేంజ్ ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ వ్యాప్త ఇండస్ట్రీలన్నింటిలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషీ కూడా తెలుగు తెరపై కనిపించేందుకు రంగం సిద్ధం అవుతోందట. దీనికోసం బోనీ కపూర్ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారట. ఇప్పటికే జాన్వి కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. జాన్వీ ఇంకా సినిమాల్లో అడుగుపెట్టలేదు. అయితే అక్కా చెల్లెళ్లలో ఎవరూ కూడా ఇప్పటివరకు టాలీవుడ్‌లో అడుగుపెట్టలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరిలో ఒకరి టాలీవుడ్ ఎంట్రీ పక్కా అని తెలుస్తోంది.

ఓ వైపు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈలోగానే ఖుషీ కపూర్ కూడా బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకోబోతోంది. దీంతో చిన్న కూతురు ఖుషీ వెండితెర ఎంట్రీ కోసం తండ్రి బోనీ కపూర్ తెగ ప్రయత్నిస్తున్నారట. ప్రముఖ దర్శకనిర్మాతల్ని కూడా దీనికోసం క్యూలో ఉంచారని తెలుస్తోంది.

ఇక ఖుషి న్యూయార్క్ వెళ్లి మరీ నటనలో శిక్షణ తీసుకుంది. బాలీవుడ్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే సమయంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్వీ తొందర్లోనే మహేష్ సరసన టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోందంటూ ఇప్పటికే కొన్ని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ అగ్ర నిర్మాణ సంస్థ జాన్వీని ఏరి కోరి తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నట్లు కూడా వార్తలున్నాయి. అయితే ఖుషీపై కొందరు దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారట. ఆమెను హీరోయిన్‌గా టాలీవుడ్‌లోనే పరిచయం చేయాలని అనుకుంటున్నారట.

కుమార్తెలిద్దరినీ స్టార్ హీరోయిన్లుగా మార్చాలని బోనీ కపూర్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారట. దీనికోసం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఆయన దృష్టి కూడా ఎక్కువగా టాలీవుడ్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముందుగా తెలుగులో జాన్వి అడుగుపెడుతుందా..? లేక ఖుషీ అరంగేట్రం చేస్తుందా..? అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: