టాలీవుడ్ లో ఎంతోమంది కమెడీయన్స్  తమదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అలా తెలుగు ప్రేక్షకులకు అందరికీ సు పరిచయమైన వ్యక్తి తాగుబోతు రమేష్. తనదైన మార్క్ తో, నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ దూసుకుపోతున్న తాగుబోతు రమేష్ తెరపై అందరినీ నవ్విస్తూ ఉన్నా కూడా తెర వెనుక జీవితం మాత్రం కష్టాల కడలి అని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో పుట్టిపెరిగిన రమేష్ సింగరేణి కాలనీ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తండ్రికి కొడుకు.

చిన్నతనం నుంచే రమేష్ వాళ్ల అమ్మను నవ్వించడానికి తన తండ్రి లా తాగినట్టు నటించి ఆమెను ఎంతగానో నవ్వించే వాడు. అలా ఆ తరువాత మిమిక్రీ నేర్చుకునీ ప్రదర్శనలు ఇచ్చేవాడు. తాగుబోతు పాత్రలకు ప్రసిద్ధి చెందిన బెంగాలీ హాస్యనటుడు జోరు ముఖర్జీ తనకు స్ఫూర్తి అని చెబుతూ ఉంటాడు. అలా మొదలైంది సినిమాలో తన తాగుబోతు నటనతో ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకున్న తాగుబోతు రమేష్ అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో కనిపించారు కానీ సరైన గుర్తింపు రాలేదు.

సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ధనరాజు వేణు చంద్ర వంటి నటులతో పరిచయం ఏర్పడింది రమేష్ కు.  ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత సుకుమార్ జగడం సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే నటుడు ఉత్తేజ్ కు పరిచయం చేశాడు రమేష్ .అలా దర్శకుడు కృష్ణవంశీ కి పరిచయం చేయగా మహాత్మ సినిమాలో అతన్ని తాగుబోతు పాత్ర కు ఎంపిక చేయగా ఆ సినిమా ఆయన మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో లో రమేష్ టీమ్ లీడర్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: