ఇక ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కు ట్రిపుల్ టైమ్ ప్రాఫిట్స్ వచ్చింది. అంతేకాదు.. దర్శకుడు పరశురామ్ కు సినీ జీవితానికి మంచి మలుపును తీసుకొచ్చింది. కాగా.. హీరోయిన్ రష్మికకు ఈ సినిమా సూపర్ బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి మరి. ఇక ఈ సినిమాకు మొదటగా గీత పాత్రకు మరో ముగ్గురు హీరోయిన్లు సంప్రదించారంట. అయితే దర్శకుడు పరశురామ్ మొదట గీత పాత్రకు.. రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదిస్తే.. అప్పటికే ఆమె హిందీ సినిమాకు డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాను వదులుకున్నారు.
ఆ తరువాత ఈ పాత్రను అను ఇమ్మానియేల్ ను సంప్రదిస్తే తాను కూడా మన బన్నీ పక్కన నా పేరు సూర్య సినిమాకు పని చేస్తూ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను వదులుకుంది. ఇక మూడోసారి పరశురామ్ రాశి ఖన్నాను సంప్రదిస్తే.. ఆమె కూడా ఈ సినిమాను కాదనుకుని నితిన్ సినిమా శ్రీనివాస కల్యాణంకు సైన్ చేశారంట. ఇక ముగ్గురు హీరోయిన్స్ సినిమాను రిజెక్ట్ చేయడంతో చివరికి ఈ పాత్ర రష్మికకి చేరింది. ఈ సినిమాతోనే రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు.. గీత గోవిందంను తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చాడు.