అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరుపొందినది హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఈమె ప్రపంచ సుందరిగా పేరుగాంచింది.ఈమె తన కళ్ళతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక ఈమె చేసిన సినిమాలు తెలుగులో ఒకటో రెండో సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఈమె జీవితాన్ని ఒక హోటల్ మార్చేసిందట.. ఆ విషయం ఏంటో చూద్దాం.
బాలీవుడ్ లో  ఐశ్వరరాయ్, అభిషేక్ బచ్చన్ జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి జీవితం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆమె ఇలా ఉండడానికి గల కారణం "న్యూయార్క్ హోటల్ "అట. అసలు ఆ హోటల్ కు , ఐశ్వరరాయ్ కి గల సంబంధం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
ఐశ్వర్యారాయ్ తను నటించిన మొదటి సినిమా"ఔర్ ప్యార్ హో గయా"ఈ సినిమా షూటింగ్ కోసం ఈమె స్విట్జర్లాండ్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే అభిషేక్ బచ్చన్ .." మేజర్ సాబ్"అనే చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వీరిరువురు షూటింగ్ కి కొంచెం దూరంలోనే ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వరరాయ్ వారిని అభిషేక్ బచ్చన్ ను కలిసి వారితో కొద్దిసేపు కూర్చోవాలని అని అనుకున్నారట.
కానీ అది ఆమెకు వీలు కాలేదు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి"డాయి అక్షర్ ప్రేమ్ కె"అని మూవీ ద్వారా మరోసారి కలిశారు. ఇక ఆ తర్వాత మరి గురు మూవీ కోసం వీరిద్దరూ కలిసి న్యూయార్క్ కి  వెళ్ళవలసి వచ్చింది. అలా కలిసిన తర్వాత వీరిద్దరు వాళ్ల రూములకు వెళ్ళిపోయారు. ఇక అభిషేక్ బయటకు వచ్చి బాల్కనీలో.. మోకాళ్లపై నిల్చొని ఐశ్వర్య రాయ్ మీద ఉన్న ప్రేమను తెలియజేశాడు.
అలా ఆరోజు చెప్పిన ప్రేమకు ఐశ్వరరాయ్ ఫిదా అయ్యిందని, ఆమె ఒకానొక సందర్భంలో తెలియజేసింది. ఇక ఇద్దరు కలిసి పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అందుచేతనే వీరికి న్యూ ఇయర్ హోటల్ బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: