పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వాక్యాలు సినీ వర్గాలలో పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి మనకు తెలిసిందే. వైసీపీ నాయకులని, ముఖ్యమంత్రి జగన్ ని కూడా తీవ్రంగా విమర్శించడంతో ఇవి బాగా వైరల్ గా మారాయి. ఇక వైసీపీ నాయకుల మధ్య జనసేన నాయకులు పోటాపోటీగా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. కొన్ని అసభ్యకర పదజాలంతో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.


ఇక ఇదే తరుణంలో సినీ ఇండస్ట్రీలో రచయిత, దర్శకుడు, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పోసాని కృష్ణ మురళి.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు. ఇదే సందర్భంలో ఒక పంజాబీ అమ్మాయి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.. ఇంకా పెద్ద ఎత్తున దుమారం లేపాయి. అంతేకాకుండా 5 కోట్లు ఇచ్చి నోర్ముయ్ అన్నట్లుగా  పోసాని అనడంతో  ఆ వార్త బాగా వైరల్ గా మారింది. పైగా పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలలోకి వెళ్లి తన ఫ్యామిలీని కూడా విమర్శించడం జరిగింది.

ఇక పంజాబీ అమ్మాయి గురించి ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో. అప్పట్లో కత్తి మహేష్ కూడా.. పూనం కౌర్ , పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బంధం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీంతో ఇది ఇప్పుడు మళ్లీ పెద్ద ఇష్యూ గా మారింది. కొంతమంది వైసీపీ నేతలు పూనమ్ కౌర్ ని టార్గెట్ చేస్తూ తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇక వీరందరికీ పూనంకు తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ స్పందించింది.

మీరందరూ రాజకీయ లబ్ధి కోసం.. ఎవరికి వారు దిగజారుకొని టీవీ ముందు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మీది ఒక మగజాతి యేనా..? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. రాజకీయాలలో ఆడవాళ్లను అడ్డ పెట్టుకోవడం చాలా అసభ్యకరంగా ఉంది.. అందుచేతనే ఇంతవరకు నా నుంచి ఒక గుడ్ న్యూస్ కూడా రాలేదని చెప్పుకొస్తోంది. ఇక పూనమ్ కౌర్ ట్వీట్ కి ఒక వైసీపీ అభిమాని.."మీ దేవుడు ఏం చేసినా దేశ ధర్మం కోసమే చేస్తారు మేడం.. దయచేసి  ఈ దేవుని బాగా అర్థం చేసుకోండి అంటూ కౌంటర్ వేశారు. ఇక ఇప్పుడు ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: