ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూట్ కి కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిన్న తన భార్య సమేతంగా స్పెయిన్ బయల్దేరి వెళ్లారు సూపర్ స్టార్ మహేష్. కొన్నాళ్ల నుండి మోకాలి సమస్యతో సతమతం అవుతున్న మహేష్, స్పెయిన్ లో కాలికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారని, అనంతరం ఆయన దాదాపుగా నెలన్నర పాటు రెస్ట్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇక సర్కారు వారి పాట సినిమాని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మూవ్ చేయనున్న సూపర్ స్టార్, ఆపైన రాజమౌళి తో మరొక సినిమా చేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి లో ప్రారంభం కావాల్సిన త్రివిక్రమ్ మూవీ మార్చి లో ప్రారంభం అవుతుందని,

ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి, మహేష్ బాబు సినిమాని వచ్చే ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. దాని ప్రకారం మహేష్, రాజమౌళిసినిమా అనౌన్స్ మెంట్ వచ్చే ఏడాది మహేష్ పుట్టిన రోజు సమయానికి రానుందని, అలానే దాని రెగ్యులర్ షూట్ 2023 ప్రారంభంలో జరుగనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. దీనిని బట్టి వీరిద్దరి కాంబో సినిమా పూర్తి అయి రిలీజ్ అయ్యేది 2026లోనే అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే అప్పటివరకు మహేష్ ఫ్యాన్స్ ఆ భారీ మూవీ కోసం ఆగక తప్పేట్లు కనపడడం లేదని అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: