మహేష్ తాజా సినిమా సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మూవీకి ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా, తప్పకుండా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న థమన్ తమ హీరో సినిమాకి కూడా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చి తీరుతారని అభిమానులు ఎంతో గట్టి నమ్మకం పెట్టుకున్నారు. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ పాత్రలో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని కనిపించనున్నట్లు టాక్.
మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ని లవర్స్ డే రోజైన ఈనెల 14న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన యూనిట్, నేడు ఈ సాంగ్ యొక్క పోస్టర్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది. కీర్తి పై మహేష్ తన తల పెట్టి నిల్చున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నపటికీ ఈ సాంగ్ ని పాడింది ఎవరు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

ఇక మహేష్ ఫ్యాన్స్ లో కొందరేమో కళావతి పల్లవితో సాగె ఈ సాంగ్ ని అనిరుద్ ఆలపించారని అంటుంటాడగా, మరికొందరేమో యువ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తన్నారు. అలానే ఈ సాంగ్ ని దేవిశ్రీప్రసాద్, అర్మాన్ మాలిక్ లలో ఒకరు పాడారనే న్యూస్ కూడా ప్రస్తుతం  మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా చూస్తే ఈ ఫస్ట్ సాంగ్ ని ఎవరు పాడారు అనే దానిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ తొలగలేదు. కాగా మరొక రెండు రోజుల్లో ఈ సాంగ్ ప్రోమోతో పాటు సింగర్ పేరుని కూడా యూనిట్ ప్రకటించనున్నట్లు టాక్. కాగా మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగనున్న సర్కారు వారి పాట మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: