టాలీవుడ్
సినిమా పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు దక్కించుకున్న
రాశి కన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అక్కినేని హీరోలతో కలిసి నటించిన మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఆ తర్వాత
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అందం అభినయం నటన కనబరిచిన ఈమెకు ప్రేక్షకులు అందరూ కూడా
ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే వరుస అవకాశాలు అందుకుని ఇప్పుడు మంచి
హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది.
తెలుగు తమిళ
హిందీ భాషల తో పాటు కొన్ని వెబ్ సైట్ లలో కూడా ఆమె నటిస్తూ దూసుకుపోతుంది ఈమె. అయితే కాస్త బొద్దుగా ఉన్న
రాశి కన్నా ఈ మధ్య ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టి అందరి మెచ్చే
హీరోయిన్ గా మారింది. మరి ఈ నేపథ్యంలో ఆమెకు అగ్ర
హీరోయిన్ గా మారే
సినిమా అవకాశాలు వస్తాయి అనేది చూడాలి. మొదట్లో ఈమె
సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలామంది అవమానించిన విషయాన్ని ఆమె స్వయంగా ఓ సందర్భంలో వ్యక్తపరిచింది. హాట్ స్టార్ లో విడుదలైన రుద్ర సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది రాశీ కన్నా.
వృత్తిపరమైన వ్యక్తిగత విశేషాలను ప్రేక్షకులతో షేర్ చేసుకోగా ఈ ప్రయాణంలో తను ఇబ్బందిపడ్డ అంశాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎవరికైనా
సినిమా అవకాశం రావడం అంత ఈజీ కాదు. మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో విమర్శలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి అని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా నేను అవమాన పడ్డ విషయం కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక సందర్భంలో నన్ను గ్యాస్ ట్యాంకర్ తో కూడా పోలుస్తూ కామెంట్లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పక్కా కమర్షియల్ అనే సినిమాలో
హీరోయిన్ గా చేస్తుంది. అలాగే
నాగచైతన్య సరసన థాంక్యూ అనే
సినిమా కూడా చేస్తుంది. మరి ఆమె సన్నబడడం ఆమె
సినిమా కెరీర్ కు ఉపయోగపడుతుందా అనేది చూడాలి.