సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ బిజీ అయ్యారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ మంచి హిట్ అందుకుంటున్నారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫుల్ టైం షూటింగ్స్ కే పరిమితమయ్యారు. అయితే తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే మంచి హిట్ టాక్తో దూసుకెళ్తోంది.
అయితే ఈ సినిమా రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్, ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివతో డైరెక్టర్ హరీశ్ శంకర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అలాగే డైరెక్టర్ కొరటాల శివ పంచుకున్నారు. ఈ చిట్చాట్లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు అడిగారు. వాటికి చిరంజీవి ఆసక్తికరమైన సమాధానాలు తెలిపారు. ఈ మేరకు హరీశ్ శంకర్ డ్యాన్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. టాలీవుడ్లో మీరిద్దరూ (రామ్ చరణ్, చిరంజీవి) కాకుండా బెస్ట్ డ్యాన్సర్ ఎవరూ..? అని హరీశ్ శంకర్.. చిరంజీవిని అడిగారు.
ఈ ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ ఇలా మాట్లాడారు.. ‘టాలీవుడ్లో చాలా మంది బెస్ట్ డ్యాన్సర్లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా అల్లుఅర్జున్, ఎన్టీఆర్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. నా దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లంటే తారక్, బన్నీనే.’ అని చెప్పారు. కాగా, ఆచార్య సినిమాతో ‘బంజారా’ పాటలో రామ్ చరణ్, చిరంజీవి డ్యాన్స్ ఇరగదీశారు. అయితే ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు చిరంజీవితో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా తన తండ్రితో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. స్టోరీ కూడా ప్లాన్ చేస్తున్నారని, డైరెక్టర్ సెలక్షన్ మిగిలిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చిరంజీవిగా ఫ్రీగా చేస్తున్నట్లు.. కూతురికి గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుంది.