టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రానా దగ్గుబాటి తో కలిసి నటించిన భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చారు. సాగర్ కె చంద్ర తీసిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన భీమ్లా నాయక్ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. యువ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పాత్ర చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయనున్న పవర్ స్టార్, దాని అనంతరం నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని తో ఒక మూవీ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కొన్నాళ్లుగా ప్రచారం అవుతున్న కథనాలను బట్టి ఇటీవల తమిళ్ లో సముద్రఖని నటించి తెరకెక్కించిన సక్సెస్ఫుల్ మూవీ వినోదయ సితం. కాగా ఈ మూవీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి.

ఇక లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ పక్కాగా ఫిక్స్ అయిందని, ఈ సినిమాని ఒక ప్రముఖ నిర్మాత నిర్మించనుండగా, ఇందులో పవర్ స్టార్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారట. అలానే దీనికి సంబంధించి అతి త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా పవన్ తో మేనల్లుడి కాంబో మూవీని చూడవచ్చన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: