మెగా స్టార్ చిరంజీవి గురించి మనకి తెలియంది కాదు.ఈ వయసులోకూడా ఆయన ఫ్యాన్ బేస్ మముకుగా ఉండదు.ఇకపోతే తాజాగా మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటించిన సంగతి మనందరికి తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో రాబోతున్నారు.ఇకపోతే  మరాఠి సినిమా నటసామ్రాట్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌, రమ్యకృష్ణ, అనసూయ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్..ఇకపోతే ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది.

ఇకపోతే తాజాగా రంగమార్తాండ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారు అని, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట, కవితలు కూడా చిరు తన వాయిస్ తో వినిపించనున్నారని ప్రకటించారు.అంతేకాకుండా  రెగ్యులర్ వాయిస్ ఓవర్ కంటే కూడా కొత్తగా, మరింత ప్రభావవంతంగా ఉండేలా, కథలోని భావోద్వేగపూరితమైన సన్నివేశాలని సృశించేలా చిరు వాయిస్ ఓవర్ ఉండబోతుందని సమాచారం.ఇకపోతే  ఇప్పటికే ఆ వాయిస్ ఓవర్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.ఇదిలావుంటే తాజాగా కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో నటించే వాళ్ళు అని ఓ వీడియో రిలీజ్ చేశారు. 

అయితే ఈ వీడియోలో 'మన అమ్మానాన్నల కథ' అంటూ ఇందులో నటించే ముఖ్య నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలిపారు.ఇకపోతే  అయితే చివరిలో చిరంజీవి పేరు కూడా వేశారు.ఇక  ఆ తర్వాత ఓ క్వశ్చన్‌ మార్క్‌ కూడా వీడియోలో వేయడంతో చిరు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాక ఇందులో ఏదైనా స్పెషల్ పాత్రలో నటిస్తున్నారా అని చర్చిస్తున్నారు.ఇక  చిరంజీవి రంగమార్తాండ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మరి ఇది ఎంతవరకు నిజమో ఆ చిత్ర యూనిట్ కే తెలియాలి. ఇదిలావుంటే దీనిపై కృష్ణవంశీ స్పందించలేదు. అయితే ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగే.చూడాలి మరి ఏమవుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: