రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవ ఉంటుందా...అయితే అలాగే  బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు తమ స్వంత ఇంటికి పెట్టే ఖర్చు చూస్తే మతులు పోవాల్సిందే.ఇకపోతే  తాజాగా రన్వీర్ సింగ్ ముంబైలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ ని కేవలం 120 కోట్లకు సొంతం చేసుకోవడం ఇప్పుడు ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా బడ్జెట్ తో సమానం లేదా అంతకంటే ఎక్కువే అనొచ్చు.ఇక అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఉండే అపార్ట్ మెంట్ లో 16 నుంచి 19 ఫ్లోర్ల దాకా విస్తరించి ఉన్న క్వాడ్రుప్లెక్స్ అంటే నాలుగు అంతస్తులు ని రన్వీర్ కొనేసుకున్నాడు.

అయితే  కేవలం స్టాంప్ డ్యూటీకే 7 కోట్ల 13 లక్షలు రిజిస్టర్ ఆఫీస్ లో చెల్లించాల్సి వచ్చిందట. ఇకపోతే ఇది మొత్తం 11 వేల 266 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. ఇక మొత్తం 19 పార్కింగ్ స్లాట్స్ తనకు కేటాయించారు.కాగా  తన ఇరుగు పొరుగు సల్మాన్, షారుఖ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రీమియం ఏరియానో.కాగా భార్య దీపికా పదుకునేతో పాటు రన్వీర్ ఇందులో కాపురం ఉండబోతున్నాడు.అంతేకాకుండా  ఇప్పటికే ఇద్దరికీ వేర్వేరుగా కలిసికట్టుగా స్వంత ఇళ్లు ఉన్నప్పటికీ దీన్ని తమ డ్రీం డెస్టినేషన్ గా ప్లాన్ చేసుకున్నారట. ఇక ఇందులో చాలా విశేషాలే ఉన్నాయట.అయితే రన్వీర్ సింగ్ ప్రస్తుతం సర్కస్ పూర్తి చేసి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని షూటింగ్ లో ఉన్నాడు.

ఇక ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ శంకర్ తో స్టార్ట్ అవుతుందట.ఇక దీపికా పదుకొనే విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో 'ప్రాజెక్ట్ కే' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: