పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత కొంత కాలం పాటు మూవీ లకు దూరంగా ఉన్నా ఆ తర్వాత మూవీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం తన మూవీ ల స్పీడ్ ని పెంచాడు. అందులో భాగంగా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ జోష్ ని చూపిస్తున్నాడు.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మరియు హరిహర వీరమల్లు మూవీ లను దాదాపు ఒకే సారి ప్రారంభించాడు. కాక పోతే భీమ్లా నాయక్ సినిమా ఇప్పటికీ విడుదల కాగా, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు.  వచ్చే నెల నుండి హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ కి కూడా కమిట్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లక ముందే పవన్ కళ్యాణ్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. తమిళంలో ఎంతో మంది ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు పొందిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగు లో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు.

అయితే ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ బల్క్ డేట్స్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్తమిళ రీమేక్ మూవీ కోసం దాదాపు మూడు నెలల సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రీమేక్ సినిమాకు తమిళ ఒరిజినల్ ను దర్శకత్వం చేసిన సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: