అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యి విజయ్ దేవరకొండ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. దేశావ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే చాలా మంది అభిమానులని సంపాదించుకున్నాడు విజయ్. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్ తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్ ఇంకా ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి చర్చిస్తున్న వీడియోని ఈ సందర్భంగా విడుదల చేశారు. ఛార్మి రెండు ఈవెంట్‌లను నిర్వహించాలనే ప్రతిపాదనను ఉంచగా ఇంకా కరణ్ దానిని ఆమోదించగా ఈ ట్రైలర్ తుఫాను సృష్టించబోతోందని విజయ్ అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్ ఈవెంట్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది.


అలాగే ముంబై ఈవెంట్ అంధేరిలోని సినీపోలిస్‌లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.లైగర్ టీమ్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు ఇంకా ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేటర్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ తుఫాన్ ని సృష్టించడానికి ఇప్పుడు రెడీ అవుతుంది. విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ ఇంకా బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్ ఇంకా అలాగే అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా ఇంకా థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఇంకా అలాగే మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: