ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మాస్ రాజా రవితేజ. అయన  కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతుండగా శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మాస్ మసాలా సినిమా గా ప్రేక్షకులను అలరిస్తుండగా ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. గత కొన్ని రోజులుగా ప్రేక్షకులను ఏ సినిమా కూడా అలరించలేకపోతున్న నేపథ్యం లో ఈ సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుంది అని చెప్పాలి.

వాస్తవానికి దర్శకుడు శరత్ ఈ సినిమాతోనే దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. కనీ గతంలో కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.  సినిమాల పట్ల గల ప్యాషన్ తో సాఫ్ట్ వేర్ సైడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు ఈ దర్శకుడు. అప్పటినుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు దర్శకుడిగా ఎదిగాడు. కమల్ నిర్మాణ సంస్థలో దర్శకత్వ విభాగంలో పనిచేశాడు గతంలో. ఇప్పుడు దర్శకుడిగా అయన పలు అవకాశాలను అందుకుంటున్నాడు.  'బిల్లా 2' వంటి సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే అందించాడు. అప్పుడే ఈ దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. .

మళ్ళీ దర్శకుడిగా ఇప్పుడు సత్తా చాటబోతున్నాడు.  తమిళంలో ఆ మధ్య వచ్చిన 'కో 2' సినిమాకి దర్శకత్వం వహించాడు. అక్కడ మంచి విజయం అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు తెలుగు లో తన సత్తా చాతాల్సిన అవసరం ఏర్పదిండి. ఇకపోతే మాస్ రాజా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన సమయం ఇది. అయన గత ఖిలాడి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది చిత్ర బృందం. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా తప్పకుండా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: