నటుడి గా , నిర్మాత గా , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నందమూరి కళ్యాణ్ రామ్ టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించు కున్నాడు.

ఆ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా మారి పోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ 'ఓ టి టి' స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయినటు వంటి జీ 5 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు , ఈ సినిమా థియేటర్ రన్ 50 రోజులు ముగిసిన తర్వాత ఈ మూవీ ని జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: