హిందీ మూవీ మద్రాస్ కేఫ్ ద్వారా వెండి తెరకు పరిచయం అయిన రాశి కన్నా ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా రాశి కన్నా , నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తున్న రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో మాత్రం కాస్త వెనకబడిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తమిళ , హిందీ మూవీ లపై కూడా ఎక్కువ ఫోకస్ నే పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ భాషల సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది.

రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు లో శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయే  ఒక మూవీ లో నటించబోతుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. అలాగే రాశి కన్నా ప్రస్తుతం తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న  సర్దార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. అలాగే హిందీ లో రాశి ఖన్నా 'యోధ' అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం రాశి ఖన్నా మూడు భాషల సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: