‘భరత్ అనే నేను’ మూవీ తరువాత కొరటాల శివ చిరంజీవి కోసం నాలుగు సంవత్సరాలు వృధా చేసుకుని ‘ఆచార్య’ మూవీని చేసినప్పటికీ ఆమూవీతో అటు ప్రేక్షకులను ఇటు చిరంజీవిని ఎవర్నీ సంతృప్తి పరచలేకపోయాడు కొరటాల. వరస హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల ఇమేజ్ ని ‘ఆచార్య’ ఘోరంగా దెబ్బతీసింది. ఆమూవీతో కొరటాల కు ఆర్థికంగా కూడ నష్టం జరిగింది అని అంటారు.




దీనితో కొరటాల జూనియర్ ఎన్టీఆర్ తో తీయవలసి ఉన్న మూవీ పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. స్వతహాగా రచయిత అయిన కొరటాల తారక్ మూవీ కథ కోసం చాల కష్టపడవలసి వచ్చింది అని అంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈమూవీ షూటింగ్ వచ్చేనెల రాబోతున్న విజయదశమి రోజున ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఈమూవీలో అత్యంత కీలకమైన ఒక పాత్రకోసం కొరటాల ఈమధ్య విజయశాంతిని కలిసి ఆమెకు తన కథను వినిపించినట్లు టాక్.




‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత విజయశాంతికి కొన్ని భారీ సినిమాల ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె ఆ ఆఫర్లను తిరస్కరించింది అని అంటారు. స్వయంగా చిరంజీవి ఆమెకు ఫోన్ చేసి తాను నటిస్తున్న ఒకసినిమాలో కీలక పాత్ర చేయమని అడిగినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించింది అని అంటారు. ఇలాంటి పరిస్థితులలో కొరటాల విజయశాంతిని కలిసి తన కథను వినిపించడమే కాకుండా ఆమె నుండి తన మూవీలో నటించేందుకు అంగీకారం పొందాడు అని వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి.



ఈమధ్య కాలంలో తన దగ్గరకు వస్తున్న అనేకమంది దర్శకులు చెపుతున్న కథలను కూడ వినడానికి ఆశక్తి కనపరచని విజయశాంతి కొరటాల చెప్పిన కథకు ఓకె చేసినట్లు వార్తలు రావడంతో కొరటాల కథలో విజయశాంతికి అంత స్పెషల్ రోల్ ఉందా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీని వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో నిలబెట్టాలని కొరటాల ప్రయత్నిస్తున్నప్పటికీ ఈమూవీ ప్రారంభం కావడం ఆలస్యం అవ్వడంతో కొరటాల తాను అనుకున్న రిలీజ్ టార్గెట్ డేట్ ను అందుకోగలడా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ విజయశాంతిలు హిట్ పెయిర్ ఇప్పుడు అదే నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె నటిస్తే సెంటిమెంట్ వర్కౌట్ అయి తమ సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని కొరటాల నమ్మకం అని అనుకోవాలి..  






మరింత సమాచారం తెలుసుకోండి: