టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఆఖరుగా మోసగాళ్లు అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.

ఇది ఇలా ఉంటే మంచు విష్ణు మాత్రం హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా మంచు విష్ణు 'జిన్నా' అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా ,  సన్నీ లియోన్ ,  పాయల్ రాజ్ పుత్ ఈ మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అని రేంజ్ లో అంచనాలను పెంచుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి జిన్నా మూవీ తో మంచు విష్ణు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వం లో కూడా ఒక మూవీ లో నటించడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొంత కాలం క్రితమే వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: