పటాస్ ప్రోగ్రాం తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్ లో సుమ తర్వాత శ్రీముఖి టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీముఖి ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కెరియర్లో పటాస్ షో ఈమెకు ప్లస్ అయింది. ఎందుకంటే ఆ షో ద్వారా ఆమెకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. ఇక ఈమె యాంకర్గానే కాకుండా వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి రన్నరప్ గా నిలిచింది.

ఇక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు శ్రీముఖి తన సీక్రెట్ లవ్ ఎఫైర్ గురించి చెప్పుకొచ్చింది. శ్రీముఖి గతంలో ఓ వ్యక్తిని ప్రేమించిందట. ఆయన కూడా ఇండస్ట్రీకి పరిచయం ఉన్న వ్యక్తి. ఇక యాంకర్ గా ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు అతను ఆమెకు పరిచయం అయ్యాడట. శ్రీముఖి కి అతను అంటే చాలా ఇష్టం అని,అతన్ని నమ్మి లవ్ లో చాలా దూరం వరకు వెళ్లిపోయినట్లు అందరి ముందే ఓపెన్ గా చెప్పేసింది. అయితే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్న టైంలో ఆ వ్యక్తి బిహేవియర్ లో మార్పు కనిపించడంతో శ్రీముఖి బాధ పడిందట. దాంతో అతని నుండి దూరమై ఒంటరిగా ఉండడమే బెటర్ అని బ్రేకప్ చెప్పిందట.

అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరిగిందని చెప్పింది. అయితే శ్రీముఖి చెప్పిన విషయాలను బట్టి ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది నెటిజన్లు ఆరా తీశారు. ఇక చివరికి ఆ వ్యక్తి ఎవరో కాదు యాంకర్ రవి అంటూ నెటిజన్లు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో యాంకర్ రవి శ్రీముఖి మధ్య లవ్ ఎఫైర్ వుంది అంటూ చాలానే వార్తలు వినిపించాయి. అంతే కాదు రవి శ్రీముఖి ని ప్రేమ పేరుతో నమ్మించి వాడుకొని వదిలేసాడు అంటూ గతంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటికి కూడా శ్రీముఖి గానీ,రవి గానీ స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: