టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ,  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పోయిన సంవత్సరం పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ,  సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్ ,  అనసూయ , రావు రమేష్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా ,  ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా ,  మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సమంతమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

పాన్ ఇండియా మూవీ రేంజ్ లో తెలుగు తో పాటు కన్నడ , తమిళ , హిందీ ,  మలయాళ భాషల్లో విడుదల అయ్యి పుష్ప ది రైస్ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే పుష్ప ది రూల్ మూవీ ని భారీ రేంజ్ లో తెరకెక్కించాలని మూవీ యూనిట్ ప్రణాళికలను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో అల్లు అర్జున్ పులి తో పోరాడే ఒక ఫైట్ సన్నివేశం ఉండనున్నట్లు ,  ఆ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కోసం మూవీ యూనిట్ థాయిలాండ్ కు వెళ్ళనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: