అగ్ర దర్శకుల్లో ఒకరైన స్టార్ డైరెక్టర్   శంకర్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...అయితే  ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది..ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరుతెచ్చుకున్న శంకర్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.అంతేకాదు ఎంతో మంది నటీనటులను సినిమాలో భాగం చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

 అంతేకాకుండా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.. ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ నటిని భాగం చేసినట్టు తెలుస్తుంది.ఇక సీనియర్ హీరోయిన్ లలో ఖుష్బూ ఒకరు.. ఈమె ప్రెజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల్లో నటిస్తుంది..ఐతేన్మరి శంకర్ ఈ సినిమాలో కీలక రోల్ కోసం ఖుష్బూ ను ఎంపిక చేసుకున్నారు.. ఇక ఈ సినిమాలో సెకండాఫ్ లో ఒక స్పెషల్ ఎపిసోడ్ లో ఖుష్బూ నటించ బోతుంది అని..ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని

 అందుకే ఈమెను ఈ పాత్ర కోసం ఎంచుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది.అయితే  మరి ఈమె రోల్ ఎలా ఉండబోతుందో అనేది చూడాలి.. ఇక ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే ఈ సినిమా షూటింగ్ కు తో పాటు శంకర్ ఇండియన్ 2 సినిమా కూడా షూట్ చేస్తున్నాడు.అయితే  రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్నాడు.ఇదిలావుంటే ఇక  ప్రెజెంట్ రాజమండ్రి లో షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫాస్ట్ గా షూట్ పూర్తి చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: