తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా, సింగర్ గా, హీరోయిన్ గా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది.కెరియర్ బీచ్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని కొన్నేళ్ళకు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక ఈ మధ్యనే తాజాగా రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలు చేయడానికి సిద్ధమయ్యింది స్వాతి. ప్రస్తుతం ఈమె నవీన్ చంద్ర సరసన మంత్ ఆఫ్ మధు సినిమాతోపాటు పంచతంత్రం వంటి సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక తాజాగా ఈమె నవీన్ చంద్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చేయడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

 

నవీన్ చంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. కథను బట్టి హీరోగా , విలన్ గా , పలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతూ ఉంటారని తెలిపింది. తాజాగా అమ్మ అనే చిత్రంలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా ఈ సినిమా విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్ షో కి స్వాతి హాజరు కావడం జరిగిందట . ఈ చిత్రంలో నవీన్ ఒక శాడిస్ట్ భర్త పాత్రలో నటించారు.. ఈ చిత్రాన్ని వీక్షించాక స్వాతి మాట్లాడుతూ.. నటుడు నవీన్ చంద్ర టాలీవుడ్ కి దొరికిన ఒక ముత్యం.. అతను ఏ సినిమాలో నటించిన ఆ పాత్రకు తగిన న్యాయం చేస్తూ ఉంటారని తెలియజేసింది.

 
అమ్మ అనే చిత్రంలో నవీన్ ఒక శాడిస్ట్ భర్తగా ఆ పాత్రలో జీవం పోసి నటించారు. సినిమా మధ్యలో నవీన్ నా దగ్గరకు వచ్చారు. నిజంగా ఆ సమయంలో అతనిని చూసి చాలా భయం వేసింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసానని తెలియజేసింది. అంతలా ఆ పాత్రలో బాగా కనెక్ట్ అయ్యానని తెలిపింది స్వాతి. ఇక ఈ సినిమా చాలా బాగా ఉంది అని తెలియజేసింది. ప్రస్తుతం కలర్ స్వాతి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మరి కలర్స్ స్వాతి రీ ఎంట్రీ తో తను అనుకున్నంత విధంగా సక్సెస్ కావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి కలర్ స్వాతికి సక్సెస్ వరిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: