కలర్ ఫోటో.. చిన్న సినిమా గా ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతేకాదు.. ఇటీవల జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సైతం సొంతం చేసుకుంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కు డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో సుహాస్ సరసన చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా.. కరోనా సంక్షోభం కారణంగా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో విడుదల చేశారట.. ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకోవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రతి సన్నివేశం ..ముఖ్యంగా చాందినీ నటనకు ప్రతి ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యిందట..

నిర్మాత సాయి రాజేశ్.. డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో థ్రియాట్రికల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల అంటే నవంబర్ 19న ఈ ను థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు. ఈ ను అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఇందులో హర్ష, శ్రీదివ్య, సునీల్ కీలకపాత్రలలో నటించగా.. కాలభైరవ సంగీతం అందించారు.

పేద, ధనిక.. కులాంతర, మతాంతర అంశాలను కాకుండా.. వర్ణ వివక్షను ఇతివృత్తంగా చేసుకుని ఈ ప్రేమకథను తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రాజ్. అప్పటివరకు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేసిన సందీప్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ఇదే. అలాగే సుహాస్ హీరోగా నటించి ఫస్ట్ మూవీ ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుని అందరి దృష్టి ని ఆకర్షించింది. ఇక ఇప్పుడు నేరుగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట .

మరింత సమాచారం తెలుసుకోండి: