బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బోల్లమ్మ హీరోయిన్ గా నటించగా ,  లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించిం.ది దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించిన స్వాతి ముత్యం మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కొన్ని రోజుల నుండి స్ట్రీమింగ్ అవుతుంది. 

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో మంచి రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్న స్వాతి ముత్యం మూవీ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ 50 మిలియన్ మినిట్స్ ను సాధించినట్లు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ,  ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్వాతి ముత్యం మూవీ దుమ్ము లేపుతుంది. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా ,  సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: