టాప్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఒక సినిమా ఒప్పుకున్న తరువాత ఆసినిమా పూర్తి అయిన తరువాత మాత్రమే మరొక సినిమా చేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల పట్ల వ్యవహరిస్తున్న పద్ధతి ఉంది అంటూ కొందరు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కరోనా వేవ్ లు ప్రారంభం కాకముందు మొదలైంది.



మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఈమూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ షూటింగ్ ఇంకా 40 శాతం పెండింగ్ లో ఉంది అని అంటున్నారు. పవన్ రెండు పడవల ప్రయాణం కారణంగా ఈమూవీకి పవన్ డేట్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు అని కూడ అంటారు.



ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈమూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో దర్శకుడు క్రిష్ కు కూడ తెలియడం లేదు అన్న టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ ఎవరూ ఊహించని విధంగా ‘వినోదయసితం’ తెలుగు రీమేక్ షూటింగ్ ప్రారంభించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈమూవీకి పవన్ 20 రోజులు షూటింగ్ కు వస్తే చాలు ఈమూవీలో అతడి పాత్ర పూర్తి అయిపోతుంది కాబట్టి ‘హరిహర వీరమల్లు’ ను పక్కకు పెట్టి పవన్ ఈసినిమా పై తన దృష్టి పెట్టాడు అన్న లీకులు వస్తున్నాయి.



ఈసినిమాకు సంబంధించి 20రోజుల షూటింగ్ లో పవన్ సాయి ధరమ్ ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరించిన తరువాత ఆపై ఈసినిమాకు సంబంధించిన మిగతా షూట్ పూర్తి చేస్తారని అంటున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ అంతా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలతో జరుగుతోంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమాటలే నిజం అయితే ఈసినిమాను నమ్ముకుని గత మూడు సంవత్సరాలుగా తన విలువైన కాలాన్ని వృధా చేసుకున్న్బ క్రిష్ పరిస్థితి ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: