తమిళ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.. ఇప్పటికే గత ఏడాది ఏప్రిల్ 28న మొదటి భాగం విడుదలై మంచి విజయం సొంతం చేసుకుని రూ.470 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది . ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రెండవ పార్ట్ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగులో కూడా గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది. ఈ నెల 28వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వివిధ నగరాలలో గ్రాండ్గా నిర్వహిస్తూ అటు త్రిష,  ఇటు జయం రవి కూడా పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించడానికి చిత్ర బృందం సన్నహాలు సిద్ధం చేస్తుంది. అంతేకాదు పొన్నియిన్ సెల్వన్  -2 మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించడానికి డేట్ అండ్ ప్లేస్ ని కూడా చిత్రబృందం ఫిక్స్ చేయడం గమనార్హం.

ఏప్రిల్ 23 సాయంత్రం 5:30 గంటల నుండి హైదరాబాదులోని నోవెటల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో నటించిన లీడ్ ఆక్టర్స్ అందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా సీక్వెల్ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: