కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ హీరో నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోనీ' అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సరికొత్త మేకవర్తో కనిపించనున్నాడు విశాల్. ఇక ఈ సినిమాలో SJసూర్య, సెల్వ రాఘవన్, సునీల్ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. విశాల్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ నుంచి విశాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో విశాల్ షాకింగ్ లుక్ తో దర్శనం ఇచ్చాడు. అయితే తాజాగా మార్క్ ఆంటోనీ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసారు మేకర్స్.

ఏప్రిల్ 27 బుధవారం సాయంత్రం 6:30 కు మార్క్ ఆంటోనీ టీజర్ రిలీజ్ కాబోతోంది.ఈ టీజర్ ని ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ విడుదల చేయబోతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ దళపతి విజయ్ ని తన ఇంట్లో కలిశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ రవివర్మ..' మార్క్ ఆంటోనీ టీజర్ను హీరో విజయ్ చూశారు. ఆయనకు ఈ టీజర్ చాలా బాగా నచ్చింది. అలాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోనీ టీజర్ తలపతి విజయ్ చేతుల మీదుగా రిలీజ్ కాబోతుండడంతో.. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు విశాల్. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ సినిమాలో విశాల్ నటనకి మంచి మార్కులు దక్కాయి. అయితే ఈసారి మార్క్ అంటోని మూవీ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు విశాల్.ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆమధ్య ఈ సినిమా షూటింగ్లో విశాల్ కి గాయాలు కూడా అయ్యాయి. ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డ విశాల్ కి మార్క్ ఆంటోనీ చిత్రం ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: