టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా గా సస్పెన్స్ ... థ్రిల్లర్ ... హర్రర్ జోనర్ లో రూపొందిన విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో సంయుక్త హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కిదర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన తెలుగు భాషలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది .

 ఇప్పటికే ఈ సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి అద్భుతమైన లాభాలను అందుకుంటుంది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు లో సూపర్ హిట్ విజయాన్ని సాధించి భారీ లాభాలను అందుకుంటున్న ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో హిందీ , తమిళ్ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు . అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యొక్క హిందీ , తమిళ్ , మలయాళం థియేటర్ హక్కు లను ఈ చిత్ర బృందం అమ్మి వేసింది.

మూవీ యొక్క హిందీ హక్కు లను మనీష్ గోల్డ్ మైన్స్ సంస్థ దక్కించుకోగా ... తమిళ హక్కులను జ్ఞానవేల్ రాజా దక్కించుకున్నాడు. ఈ మలయాళ మలయాళ హక్కులను E4 మీడియా సంస్థ దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూడు భాషలలో కూడా ఈ మూవీ ని మే 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా హిందీ , తమిళ్ , మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తోందో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: