పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పవన్ ... వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్ మూవీ లో పవన్ హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ ,  ఓజి మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే "ఓజి" మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పవన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాకు టాలీవుడ్ యువ దర్శకులలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం పవన్ ... ప్రియాంక లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్  మే 17వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ లో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు అని వార్తలు రావడంతో ఈ మూవీ.పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: