అయితే జూన్ లో పెరగాల్సిన డిఎ ని రక్షాబంధన్ లేదా దసరాకు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు మరొకసారి నాలుగు శాతం డిఏ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .42 శాతం నుంచి 46% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం..మళ్లీ వచ్చే సంవత్సరం 2024 జనవరిలో డిఎ 50 శాతం దాటే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ డిఏ ను ఏడవ వేతనం సిఫార్సు కింద జారీ చేసినట్లుగా తెలుస్తోంది..
అలాగే రాబోయే రోజుల్లో 8వ వేతనం సిఫార్సును కూడా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభలో ఇటీవల పార్లమెంటు సమావేశంలో భాగంగా అక్కడ కొంతమంది నాయకులు సైతం ప్రశ్న వేయక అందుకు సంబంధించిన సమాధానాన్ని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలియజేయడం జరిగింది . అయితే ఇప్పట్లో ఎనిమిదో వేతనం తీసుకువచ్చే ఆలోచనలో లేదన్నారు.. ఇది వరకు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.. ప్రస్తుతం ఉన్న ద్రవయోల్బణం ఆధారంగా..AICIP IW ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారని తెలియజేశారు అంటే ఇప్పట్లో 8వ వేతనం సిఫార్సు లేనట్టే కానీ దీనికితోడు ఏడవ వేతనం సిఫార్సు మేరకు డిఏ మాత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో 50% దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి