టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ హీరో సూర్య. గజని, యముడు లాంటి మూవీస్ తో సూర్యకు మంచి పేరు వచ్చింది. ఆయన తమ్ముడు కార్తీ హీరోగా ‘యుగానికొక్కడు ’ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ఎన్నో వేరియేషన్స్ చూపించిన కార్తీ తర్వాత వరుసగా మంచి విజయాలు అందుకున్నాడు. తెలుగు లో నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ మూవీతో తెలుగు వాళ్లకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్నావు కార్తీ. ఈ ఏడాది వచ్చిన ‘ఖైదీ’ మూవీ తెలుగు లో కూడా మంచి విజయం అందుకుంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కథను నమ్మి దానికి తగ్గట్టు కార్తీ నటన హైలెట్ కావడంతో సినిమా తెలుగు, తమిళంలో మంచి విజయం అందుకుంది.
కోలీవుడ్ లోనే కాదు తెలుగు లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. గత శుక్రవారం కార్తీ, జ్యోతిక నటించిన ‘దొంగ’ మూవీ రిలీజ్ అయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ టైమింగ్ తో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. తెలుగులో కన్నా తమిళ్ ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. దాంతో ఆయన తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో విశాల్ తో ‘అభిమన్యుడు’ మూవీ తో బాక్సాఫీస్ షెక్ చేసి.. తర్వాత శివకార్తికేయన్ తో 'హీరో' సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు మిత్రన్. అయితే కార్తీ మిత్రన్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నట్లు కోలీవుడ్ టాక్.
విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నడవనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో కార్తి నటిస్తున్నాడు. మనిరత్నంతో మూవీ పూర్తయిన తర్వాత మిత్రన్ తో కలిసి కార్తీ సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై అందరిలోను ఆసక్తి వుంది.