ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫేమస్ అవ్వడానికి సాఫ్ట్ టార్గెట్ అయిన సినీ పరిశ్రమలోని ప్రముఖులు పై బుద్ధిలేని నిరాధార వ్యాఖ్యలు చేస్తూ అందరినీ కలవరపెడుతున్నారు. ఓ నాలుగు వారాల క్రితం మేడ్చల్ జిల్లా కి చెందిన సునిశిత్ అనే డైరెక్టర్ యాంకర్ ప్రదీప్ ఒక అమ్మాయి ని వేధించిన కేసులో అరెస్టు అయ్యి రెండు రోజులపాటు జైలు లో ఉన్నాడని, సెంట్రల్ ఫిలిం బోర్డు నియమాల ప్రకారం అతను హీరోగా నడిచేందుకు అనర్హుడని తనపై ఫిర్యాదు చేసాడు. ఐతే ఈ విషయం పై స్పందించిన యాంకర్ ప్రదీప్ అస్సలు సునిశిత్ ఎవరో కూడా తనకు తెలియదని, తాను ఎప్పుడూ జైలుకి వెళ్లలేదని ఇవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చాడు. 



ఐతే మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన డైరెక్టర్ సునిశిత్ యాంకర్ ప్రదీప్ పై సంచలన వ్యాఖ్యలు చేసి అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాడు. అతడు మాట్లాడుతూ... టాలీవుడ్ హీరోయిన్ భలే భలే మగాడివోయ్ ఫేమ్ లావణ్య త్రిపాఠికి, యాంకర్ ప్రదీప్ కి మధ్య ఎఫైర్ ఉందని ఆరోపణలు చేశాడు. ఈ విషయాన్ని బయటపెడుతున్నందుకు ప్రదీప్ సుధీర్ తో కలిసి జనసేన నేతలతో అతడిని బెదిరిస్తున్నాడని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తనపై ప్రదీప్ కేసు పెట్టాడని ఆరోపణలు చేసిన సునిశిత్... ఇతర టాలీవుడ్ సెలబ్రిటీస్ పై కూడా నమ్మశక్యం కానీ వ్యాఖ్యలు చేశాడు.




బలుపు చిత్రంలో తనని హీరోగా తీసుకొని కొద్దిరోజులు షూటింగ్ కూడా తీసారని... కానీ తరువాత తనకి 45లక్షలు ఇచ్చి ఆ సినిమా నుండి తప్పించారని, అప్పుడు మాస్ మహారాజ రవి తేజ ని ఆ సినిమాలో హీరోగా నటించాడని చెప్పుకొచ్చాడు. అలాగే, తనకు వన్:నేనొక్కడినే సినిమాలో నటించే అవకాశం వచ్చిందని... కానీ మహేష్ బాబు కోసం ఆ ఛాన్స్ ని వదిలేసానని అన్నాడు. దీంతో ఏందయ్యా ఇదీ? ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా?! అంటూ నెటిజనులు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: