శతమానం భవతి మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు శర్వానంద్.  ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  అంతే కాదు జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది.  ఈ మూవీతో శర్వానంద్ కి ఇక వరుస విజయాలు అనుకున్నారు.  కానీ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్ టాక్ వచ్చాయి.  అయితే హీరోగా మాత్రం ఎక్కడా డ్యామేజ్ కాకుండా ముందుకు సాగుతున్నాడు.  కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ రన్ రాజా రన్ తర్వాత మంచి విజయం అందుకున్నాడు.  చిన్న నిర్మాతలకు బాగా కనెక్ట్ అయ్యాడు. 

 

శర్వానంద్ కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా హడావిడిగా సినిమాలు చేసిన సందర్భాలు కనిపించవు.  ఆయన కెరీర్ లో ఎప్పుడు హడావుడిగా సినిమాలు కంప్లీట్ చేయాలనే తాప్రతయం లేదని అంటారు.  షెడ్యూల్ కి కూడా గ్యాప్ తీసుకుంటూ తాపీగా షూటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాడు. శర్వానంద్ ఎంచుకునే కథల కారణంగానే అటు యూత్ .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ మద్య తన స్నేహితుల కోసం కొన్ని స్క్రిప్ట్ విషయం పట్టించుకోకుండా నటించానని అన్నారు.  కానీ ఇప్పుడు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని అన్నారు. ఇటీవల శర్వాకి వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి.

 

అయినా ఆయన తన పారితోషికం విషయంలో తగ్గడం లేదట. సినిమాకి ఆయన 7 కోట్ల వరకూ తీసుకుంటాడని టాక్. పారితోషికం విషయంలో తగ్గేది లేదని ఆయన చెబుతుండటంతో, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  ప్రస్తుతం శ్రీకారం సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.  ఈ మూవీ కూడా రైతులకు సంబంధించింది కావడంతో మరో సక్సెస్ అవుతుందని ఆడియాన్స్ అనుకుంటున్నారు.  ప్రస్తుతం  శర్వా  'శ్రీకారం'తో పాటు ప్రస్తుతం తన చేతిలో వున్న మూడు సినిమాలపై దృష్టిపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: