అజ్ఞాతవాసి సినిమాతో పోయిన క్రేజ్ మొత్తం త్రివిక్రమ్ ఎన్టీఆర్తో చేసిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో కాస్త తెచ్చుకున్నాడు. తాజాగా సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో తన క్రేజ్ మొత్తం తెచ్చుకుని ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రేసులోకి వచ్చేశాడు. తాను ఫామ్లో ఉంటే.. తన కలం పదునుతో పని చేస్తే తాను ఎలాంటి గొప్ప డైరెక్టర్నో ఈ సినిమాతో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమా ఏకంగా రు. 160కు పైగా కోట్ల షేర్ రాబట్టడంతో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ఎంతో మంది క్రేజీ హీరోలు క్యూలో ఉన్నారు. అయినా త్రివిక్రమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో సినిమా చేస్తాడో ? కూడా తెలియని పరిస్థితి.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అది అలా ఉంటే త్రివిక్రమ్ మీద ఓ క్రేజీ న్యూస్ బయటకువచ్చింది. త్రివిక్రమ్ ఓ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నాడట. రు. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా రు. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు గాసిప్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమా తర్వాత త్రివిక్రమ్ రామ్చరణ్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం రామ్చరణ్ బిజీగా ఉన్న నేపథ్యంలో చరణ్ ప్రాజెక్టు ఒకవేళ ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్త వినిపిస్తున్నా ఆ పారిశ్రామికవేత్త ఎవరు ? ఆయన కుమారుడు ఎవరు ? అన్నది మాత్రం బయటకు రావడం లేదు. మరి దీనిపై త్రివిక్రముడు క్లారిటీ ఇస్తేనే అందరికి నిజాలు తెలిసే అవకాశం ఉంది.