ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఇద్దరంటే ఇద్దరు హీరోయిన్స్ ఏలుతున్నారు. వారిద్దరే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అయిపోయారు. అయితే వారిద్దరూ ఎవరో కాదు పూజ హెగ్డే, రష్మిక మందన. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిరోజు వీరిద్దరి గురించి చర్చించుకుంటారు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన "అల వైకుంఠ పురం లో"  సినిమా లో పూజ హెగ్డే హిట్ అందుకోగా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రష్మిక బంధన కూడా భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి వీరిద్దరు బ్లాక్ బాస్టర్ హిట్ లను వారి ఖాతాలో వేసుకున్నారు.

 

 


ఇకపోతే ప్రస్తుతం పూజ హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యాం సినిమాలో నటిస్తుంది. రాధేశ్యాం ఆఫీషియల్ టైటిల్ కానప్పటికీ దాదాపు ఈ టైటిల్ తోనే యూనిట్ పనిచేస్తుంది. అలాగే చివరికి ఈ పేరే పెట్టేందుకు ఫిక్స్ అయ్యారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా దాదాపు 80 శాతం వరకు షూటింగ్ ముగిసింది. పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలో కూడా నటిస్తుంది. దీనితో ప్రస్తుతం పూజ హెగ్డే దగ్గర మూడు భారీ సినిమాలు ఉన్నాయి.

 

 


ఇక కన్నడ భామ రష్మిక మందన కూడా టాలీవుడ్ లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ స్టార్ నటిస్తున్న సినిమా పుష్ప చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు నేపథ్యంలో అది కూడా పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. అయితే ఈ సినిమాలో తనకి చాన్స్ వస్తుందని రష్మిక కూడా ఊహించలేదట. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో  రాబోతున్న " అయినను పోయిరావలె హస్తినకు " సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయని సమాచారం తెలుస్తుంది.

 

 


ఇక ఇలా ఉంటే తాజా పరిణామాలు చూస్తుంటే రష్మిక మందాన టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే ముందంజలో ఉందని తెలిసిన సంగతి. నిజానికి రష్మిక కంటే పూజకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కలు చాలా మారిపోయాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఎవరూ చేయాలనే ఉద్దేశం కూడా లేకపోలేదు. అంతేకాదు ఏకంగా పరిస్థితి ఎలా మారిందంటే హీరో, హీరోయిన్స్, దర్శకులు రెమ్యూనరేషన్స్ వీరందరి మిషన్ లో కూడా చాలావరకు కోత పడిందని తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ దేశంలో సగానికి పైగా సాగే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి ఇది రష్మిక మందన కి కలిసొచ్చే విషయమే. దీనికి కారణం రష్మికా కంటే పూజ హెగ్డే కి ఎక్కువ కాబట్టి. కనుక పూజా హెగ్డే వద్దు అనుకుంటే గనక తర్వాత ఒకే ఒక్క ఛాయిస్ రష్మిక మందన. కాబట్టి నెంబర్ వన్ స్థానానికి రష్మిక చేరుకోవడం పెద్ద సంగతి ఏం కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: