సైకో మిస్టరీ థ్రిల్లర్ `రాట్ససన్`. తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో `రాక్షసుడు` పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా సక్సెస్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరో సైకో థ్రిల్లర్తో విష్ణ విశాల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్పై స్వయంగా విష్ణు విశాలే నిర్మిస్తున్నారు. ఇంద్రు నేత్రు నలై 2015 సైన్స్ ఫిక్షన్ చిత్రం.. ఇందులో విష్ణు విశాల్ , మియా ప్రధాన పాత్రల్లో నటించగా, కరుణకరన్, జయప్రకాష్, టిఎం కార్తీక్, బాగవతి పెరుమాల్ తదితరులు కీలక సహాయక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఆర్. రవికుమార్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మురళీ కార్తిక్ రూపొందిస్తున్న ఈ సైకో థ్రిల్లర్కు `మోహన్దాస్` అనే టైటిల్ని ఖరారు చేశారు. శనివారం ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ని రిలీజ్ చేశారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొదుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ సైకో కిల్లర్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
టీజర్లో ఓ యువతిని హ్యామర్తో కొట్టి చంపుతున్న దృశ్యాలు భయంకరంగా వున్నాయి. ఈ చిత్ర షూటింగ్ని ఈ నెలలోనే ప్రారంభించాలని అనుకున్నా కరోనా కారణంగా రెగ్యులర్ షూటింగ్ని వాయిదా వేశామని హీరో విష్ణు విశాల్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు విష్ణు శాల్ F.I.R మూవీలో కూడా నటిస్తున్నాడు.
After intriguing Mohandas teaser, Vishnu vishal is all set to take us for another whirlwind - Official announcement! 🥳#VishnuVishal #Mohandas @TheVishnuVishal https://t.co/IoNq2QB7cF
— Behindwoods (@behindwoods) April 17, 2020