దసరా పండుగ వస్తుందంటే పూజలు, సంబరాలు గుర్తుకువస్తాయి. కానీ ఈ దసరా మాత్రం భారీ ఫైటింగ్ ను చూడబోతోంది. నందమూరి, కొణిదెల వసూళ్ల పోరుని ఎక్స్ పీరియన్స్ చేయబోతోంది. ఈ విజయదశమికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. 

 

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పొలిటికల్ హీరోలు. పాలిటిక్స్ ప్లస్ సినిమాలు రెండింటితో బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు యాక్టింగ్ తో ట్రావెల్ చేస్తున్నారు. పబ్లిక్ స్పీచ్ లు, రికార్డింగ్ థియేటర్లు రెండింటినీ మేనేజ్ చేస్తున్నారు. అలాంటి ఈ స్టార్స్ ఇద్దరూ ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. దసరా బరిలో దిగబోతున్నారు. 

 

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ వకీల్ సాబ్ లా మారాడు పవన్ కళ్యాణ్. రెండేళ్ల తర్వాత పవన్ నటిస్తోన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. 

 

మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే మేతో లాక్ డౌన్ ముగిసినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెబుతున్నారు. సో జూన్ లోనే మళ్లీ షూటింగ్ లు మొదలయ్యే అవకాశముంది. ఇక వకీల్ సాబ్ ప్యాచ్ వర్క్ లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసేందుకు ఓ రెండు నెలలు పట్టే అవకాశముంది. దీంతో పవన్ రీఎంట్రీ మూవీని దసరా పండుగకు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫీలవుతోందట యూనిట్. 

 

టాప్ హీరోలు ఇద్దరూ నెక్ టు నెక్ ఫైటింగ్ కు దిగితే ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదముంది. వసూళ్లపైనా ఆ ప్రభావం పడుతుంది. కానీ ఫెస్టివల్ సీజన్ లో బోల్డన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అందుకే హాలిడే సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు బాలయ్య సినిమాను బరిలో దింపాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: