బాలీవుడ్ లో ఎపపుడు సంచలనాలు సృష్టిస్తూ.. హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టే నటి పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  తెలుగు లో కూడా ఒకటి రెండు చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. సెమీ న్యూడ్ గా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.  తాజాగా  బాలీవుడ్ నటి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ముంబై పోలీసుల‌కి  అడ్డంగా బుక్కయింది.  నిన్న రాత్రి పూన‌మ్ పాండే త‌న బిఎమ్‌డబ్ల్యూ కారులో చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్‌ బాంబేతో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టింది. పూనం పాండే మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో తన కారులో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి కారణం లేకుండా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నట్టు గుర్తించారు. 

 

వీరి కారును ఆపిన మెరైన్ డ్రైవ్ ప్రాంత పోలీసులు, బయటకు వచ్చిన కారణాన్ని అడుగగా, సరైన సమాధానం చెప్పక పోవడంతో, ఇద్దరినీ అరెస్ట్ చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని వదిలేశామని జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశందర్ స్పష్టం చేశారు. కాగా, వీరిద్దరిపైనా ఐపీసీ సెక్షన్ 188, 269 కింద కేసు నమోదైందని అన్నారు. పూనం పాండే.. నషా, ఆగయా హీరో, ద జర్నీ ఆఫ్ కర్మ చిత్రాల్లో నటించారు.  ఆమె నటిగా నిలదొక్కుకోలేకపోయింది.

 

గతంలో హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలపై విషయంలో ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా  ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటూ తమకు తోచిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.  మరికొంత మంది కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ సందర్బంగా సినీ ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: