ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎక్కడ అందాల ఆరబోతకు తావివ్వకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తన అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది. గీతగోవిందం భీష్మ సరిలేరు నీకెవ్వరు లాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో  నటించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సినిమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ అటు  సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన యాక్టివ్ గా కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది. 


 అయితే తాజాగా రష్మిక మందన్న తన జీవితంలో ఎదుర్కొన్న అభద్రతాభావం గురించి... వాటి నుంచి ఇలా బయట పడ్డాను  అనే విషయం గురించి తాజాగా ఒక పోస్టు పెట్టగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక మనిషి గా చెబుతున్న కొన్ని సార్లు మన గురించైనా... లేదా ఇతరుల గురించైనా  ఆలోచిస్తూ... అవసరం లేని విషయాల కోసం ఆలోచించి బుర్ర పాడు చేసుకుని అభద్రతకు గురవుతుంటాము... నేను బరువు పెరుగుతున్నానా. లేదా మరీ సన్నగా ఉన్నానా.. నా చర్మం జిడ్డుగా  ఉందా రఫ్ గా ఉందా ఇలాంటి విషయాలను స్నేహితులను పదేపదే అడుగుతుంటాం . ఒకవేళ పొరపాటున స్నేహితులు nee ముఖానికి  ఏమైంది అని అన్నారు అనుకోండి  అంతేనా... పది రోజుల పాటు దుప్పటి కింద ఉండిపోతాం... బయటకు రావడానికి మాత్రం అస్సలు ఇష్టపడము అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. 

 

 వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో నేను ఎంతగానో అభద్రతా భావానికి లోనయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. నా పని నా శరీరాకృతి మానసిక ఆరోగ్యం ఇలా ప్రతి విషయంలో తాను ఎంతగానో ఆందోళన చెంది అభద్రతా భావానికి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. కానీ అలా అభద్రతా భావానికి గురవ్వడం కరెక్ట్ కాదని చివరికి తనకి తాను రియలైజ్ అయ్యాను అంటు తన పోస్టులో తెలిపింది. అందుకే ఈ విషయాన్ని తాను అందరికీ చెప్పదలచుకున్నాను అంటూ తెలిపింది. అభద్రత భావాలకు గురిచేసే విషయాలను మీ బలాలుగా మార్చుకుని మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టండి అంటూ రష్మిక సూచించింది. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు అంటూ అభిమానులు ధైర్యాన్ని నింపింది రష్మిక మందన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: