టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌హేష్ సినిమా వ‌స్తుందంటే చాలు ఇండ‌స్ట్రీకి పెద్ద పండ‌గే. మ‌హేష్ మూడు వ‌రుస హిట్ల‌తో మంచి జోరు మీదున్నాడు. మహేష్ బాబు నుంచి ఎప్పుడు అయితే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చిందో అక్కడి నుంచి కూడా టాలీవుడ్ లో ఆ సినిమాకు సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో హడావుడి ఒక రేంజ్ లో ఉంటాయి. సినిమా ఏ విధంగా ఉంటుంది. ఇక తాజాగా స‌ర్కారు వారి పాట స్టిల్ రాగానే కథ ఎలా ఉంటుంది మహేష్ బాబు జుట్టు ఎందుకు పెంచుతున్నాడు, టాటూ ఎందుకు వేసుకుంటున్నాడు వంటి చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

ఇక ఇది పక్కన పెడితే స‌ర్కారు వారి పాట స్టిల్‌ సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి దాదాపు 20 లక్షల  పోస్ట్ లు వచ్చాయి. రెండు మూడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయితే ఒక రేంజ్ లో షేక్ అయ్యాయి. ఇటీవలి కాలంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ వచ్చింది దీనికే. దీనితో ఇప్పుడు బాలీవుడ్ లో దీని గురించి చర్చ జరుగుతుంది అని సమాచారం. 

 

సినిమాలో తమకు కూడా భాగం కావాలి అని ఒక నిర్మాత వచ్చినట్టు సమాచారం. పాన్ ఇండియా సినిమా కాబట్టి తాను ప్రమోట్ చేస్తా అని సదరు నిర్మాత ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ సినిమాను మాత్రం నిర్మాతలు బాలీవుడ్ లో ఎవరికి అమ్మే ఆలోచనలో లేరు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: