నాచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో చేస్తున్న వి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ చేస్తే కచ్చితంగా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం థియేటర్ లో రిలీజ్ చేసే సినిమా అని.. రిలీజ్ లేట్ అయిన కచ్చితంగా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సంక్రుత్యన్ డైరక్షన్ లో శ్యామ్ సింగ రాయ్ మూవీ చేస్తున్నాడు.

 

ఈ సినిమాను భరీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఐదురు క్రేజీ హీరోయిన్స్ పేర్లు ఫినల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయికలు అందరిని ఈ సినిమాలో నటింపచేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో రష్మిక, నిధి అగర్వాల్, రాశి ఖన్నా, నివేదా థామస్, రితు వర్మ హీరోయిన్స్ లో ముగ్గురిని సెలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

శ్యామ్ సింగ రాయ్ మూవీ వేసిన మాస్టర్ ప్లాన్ తో స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఈ సినిమాతో నాని నేషనల్ వైడ్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. అందుకే కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా హయ్యెస్ట్ బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా సినిమాతో సత్తా చాటిన రాహుల్ సాంక్రుత్యన్ తప్పకుండా అంచనాలను మించేలా ఈ సినిమా తెరకెక్కిస్తాడని అంచనా వేస్తున్నారు. వి సినిమా రిలీజ్ తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ కల్లా టక్ జగదీష్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక టక్ జగదీష్ సినిమా మాత్రం నెక్స్ట్ ఇయర్ మిడిల్ లో రిలీజ్ అనుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: