ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.. విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన తొలి చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రేడియో మాధవ్’గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ ను బుధవారం హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “విజయ్ సేతుపతిగారు నటించిన ‘రేడియో మాధవ్’ తెలుగులో అనువాదం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

తెలుగులో మాటలు, పాటలు రాసిన భాష్య శ్రీ మాట్లాడుతూ “తెలుగులో వెంకటేష్ గారు నటించిన ‘రాజా’, ‘సంక్రాంతి’ తరహా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చేసిన డబ్బింగ్ సినిమా ఇది” అని అన్నారు.

విజయ్ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: గుండేపూడి శీను, మాటలు & పాటలు : భాష్య శ్రీ, ఎడిటింగ్‌: షామీర్ ముహమ్మెద్, కెమెరా: సజన్ కలతిల్, సంగీతం: ఏం. జయచంద్రన్, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు-ఫణి కందుకూరి,  ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్. శ్రీనివాస మూర్తి, సహ- నిర్మాత: డి.వి . చలం, నిర్మాత: డి.వి . కృష్ణస్వామి, కధ-దర్శకత్వం: సనల్ కలతిల్ మొదలైన వారు ఈ సినిమా కి పని చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: