దర్శకుడు భాను శంకర్ గతంలోనే అభిరామ్ కోసం ఓ కథ సిద్ధం చేశారని, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే అభి లాంఛ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా సంగతి కూడా ఇంకా తేలలేదు. ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు మళ్లీ కొడుకుకోసం కథలు వింటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు యువ దర్శకులు కొత్త కథలతో సురేష్ ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్లారట. ఈ రెండు కథల్లో ఏదో ఒకటి ఫైనల్ అవుతుందని అప్పుడు అభిరామ్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు.
లాక్ డౌన్ వ్యవహారాలన్నీ సెట్ అయిపోయి.. సినిమా షూటింగ్ లు తిరిగి జోరందుకుంటే.. అదే సమయంలో అభిరామ్ సినిమా కూడా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ముందు సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా చేస్తే.. ఆ తర్వాత అభిరామ్ తో సినిమాకోసం అటు గీతా ఆర్ట్స్, ఇటు అన్నపూర్ణ బ్యానర్లు కూడా వెయిట్ చేస్తున్నాయట. అభిరామ్ తాత దగ్గుబాటి రామానాయుడు పై ఉన్న గౌరవంతో.. సినిమాలు చేయడానికి వారు ముందుకొస్తున్నారని తెలుస్తోంది. అయితే ముందు కొడుకుని హీరోగా నిలబెట్టే బాధ్యత సురేష్ బాబు తీసుకున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతున్నా.. హీరోలో విషయం ఉంటేనే అతను నెగ్గుకు రాగలడు. మరి అభిరామ్, అన్నయ్య రానా లాగా తనదైన మార్క్ చూపిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.